- రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే
- కాంగ్రెస్ నాయకులు బుయ్యని మనోహర్రెడ్డి
తాండూరు : రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని భరించే ఓపిక ప్రజలకి లేదని, వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం అని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డిసిసిబి చైర్మన్, కాంగ్రెస్ నేత బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన తాండూరు నియోజకవర్గం లోని తాండూర్ పట్టణం, తాండూరు మండలం తో పాటు పలు గ్రామాల్లో పర్యటించారు. పట్టణంలోని గ్రీన్ సిటీ కాలనీలో కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరు అయి నాయకులతో కార్యకర్తలు లతో మాట్లాడుతూ . బిఆర్ఎస్ నాయకులు అవినీతి కూపంలో చిక్కుకుపోయారని, ప్రజలు ఎవ్వరు కూడా బిఆర్ఎస్ నీ నమ్మలేని పరిస్థితి అన్నారు . రాబోయే ఎన్నికల్లో ప్రజలు బిఆర్ఎస్ కు గట్టి గుణపాఠం చెబుతారని, కాంగ్రెస్ కు అధికార పగ్గాలు అందిస్తారని పేరోన్నారు . ఎన్నికల సమయంలో బిఆర్ఎస్ ప్రజలకు ఇచ్చిన హామీలను నమ్మరు అని . ఇకపై బిఆర్ఎస్ ను భరించే ఓపిక ప్రజలకు లేదని, కాంగ్రెస్ కు ఓటేసి బిఆర్ఎస్ ను సాగనంపుతారని ఆయన అన్నారు. అంతకు ముందు తాండూరు మండలంలోని పలు గ్రామాలకు చెందిన పలువురు మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు