Friday, September 20, 2024
spot_img

కౌంటింగ్‌ కోసం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు

తప్పక చదవండి
  • సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో ఎన్నికల
    నిర్వహణ సిబ్బందితో ఏర్పాట్లను పరిశీలించిన
    రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ డిఎస్‌ చౌహన్‌

ఎల్బీనగర్‌ : త్వరలో తెలంగాణ రాష్ట్రం లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకొని క్షేత్రస్థాయిలో భద్రత ఏర్పాట్లను మరియు ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు పర్యవేక్షించడానికి గురు వారం రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ డిఎస్‌ చౌహన్‌ సరూర్‌ నగర్‌ లోని ఇండోర్‌ స్టేడియం సందర్శించడం జరిగింది. ఇక్కడి స్ట్రాంగ్‌ రూమ్‌ ఏర్పాట్ల ను కూడా సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహిం చడానికి తమ వంతు కృషి చేస్తామని కమిషనర్‌ తెలిపారు.ఎన్నికల విధుల కు సంబంధించిన నిర్దిష్టమైన సూచనలను సిబ్బందికి అందిం చామని, క్షేత్ర స్థాయిలో విధులు నిర్వర్తించే కిందిస్థాయి సిబ్బందికి కూడా ఎన్నికల నిబంధ నల మీద పరిజ్ఞానాన్ని, అవగాహనను కల్పించడానికి వారితో సమావే శాలను కూడా నిర్వహిస్తున్నామని అన్నారు.రాచకొండ పరిధిలో ఉన్న అసెం బ్లీ నియోజకవర్గాలలో అసెంబ్లీ ఎన్నికలను ఎటువంటి అవకతవకలు జరగ కుండా, కౌంటింగ్‌ నిర్వహించడానికి అన్నిరకాల భద్రత ఏర్పాట్లు చేస్తు న్నా మని ఈ సందర్భంగా కమిషనర్‌ పేర్కొన్నారు. పాత నేరస్థులను బైండో వర్‌ చేస్తున్నామని, అక్రమంగా తరలిస్తున్న డబ్బును పట్టుకోవడానికి అవస రమై న చోట్ల చెక్‌ పోస్టులను ఏర్పాటు చేస్తున్నామని ఈ సందర్భంగా కమిష నర్‌ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్‌ జోన్‌ డీసీపీ సాయి శ్రీ, ఆర్‌ఓ, ఎల్బీనగర్‌ జోనల్‌ కమీషనర్‌ పంకజ, పోలీస్‌, జిహెచ్‌ఎంసి అధికారులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు