హైదరాబాద్ : మలక్ పెట్ ట్రాఫిక్ ఠాణా హెడ్ కానిస్టేబుల్ సురేశ్ హఠాన్మరణం చెందారు. మలక్పేట్ ట్రాఫిక్ స్టేషన్ పరిధిలో రెండేళ్లుగా పనిచేస్తున్నారు. భార్య, కుమార్తె, కుమారుడితో కలిసి చంపాపేట్ ఈస్ట్ మారుతీనగర్ నివసిస్తున్నారు. ఉదయం డీఆర్డీవో టౌన్షిప్లోని బి ఏ ఫుట్ బాల్ మైదానంలో వాకింగ్ చేస్తూ ఛాతినొప్పితో కుప్పకూలిపోగా, తోటి మిత్రులు కంచన్ బాగ్ అపోలో డీఆర్డీవో ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతిచెందారు