- 2 కోట్ల విలువగల పట్టుచీరలు స్వాధీనం..
- ఎన్నికల్లో పంచేందుకే తెచ్చారంటూ అనుమానం వ్యక్తం చేస్తున్న స్థానికులు..
- పట్టు చీరలు తెచ్చింది అధికార పార్టీ నాయకులేనా..?
- ప్రగతి నగర్ పంచవటి అపార్ట్మెంట్ పై పోలీసుల దాడి..
హైదరాబాద్ : బాచుపల్లి పియస్ పరిదిలోని ప్రగతినగర్ లో పంచవటి అపార్ట్మెంట్ పై పోలీసులు దాడి చేసారు. ( రూ. 2,25,98,590/-) రెండు కోట్ల ఇరవైఐదు లక్షల తొంబై ఎనమిది వేల రుపాయలు.. విలువచేసే 743 బ్యాగ్ లలో ఉన్న పట్టుచీరలను, 2 లారీలతో అపార్ట్మెంట్ లో ఓ డబుల్ బెడ్ రూమ్ లో డంప్ చేస్తున్న సమయంలో.. స్దానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు పట్టుకున్నారు. వరంగల్ ప్రాంతంలో ఉండే కాశం పుల్లయ్య, మాంగల్య షాపింగ్ మాల్స్ నుండి చీరలు కొన్నట్టు యజమాని పోలీసులకు తెలుపుతున్నాడు. పట్టుచీరల లోడ్ లతో ఉన్న 2లారీలను సీజ్ చేసి, పోలీస్ స్టేషన్ కి తరలించారు బాచుపల్లి పోలీసులు. ఎలక్షన్ సమయం ఉన్నందున ఓటర్లకు పంచడం కోసమే ఈ చీరలు ఇక్కడికి తీసుకొచ్చారని స్దానికులు అనుమానం వెలిబుచ్చారు.