హైదరాబాద్ : హైదరాబాద్ ఇన్చార్జి పోలీస్ కమిషనర్గా విక్రమ్సింగ్ మాన్ నియమితులయ్యారు. వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఐదు రాష్ట్రాల్లో సీనియర్ అధికారులను కేంద్ర ఎన్నికల కమిషన్ బదిలీ చేసింది. బదిలీ అయినవారిలో తొమ్మిది మంది జిల్లా కలెక్టర్లు, 25 మంది పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, అదనపు ఎస్పీలు ఉన్నారు. ఇందులో తెలంగాణలో రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, నిర్మల్ జిల్లాల కలెక్టర్లతోపాటు 13 మంది పోలీసు అధికారులు ఉన్నారు. వీరి స్థానంలో కొత్తవారిని నియమించాలని, రి స్థానాల్లో ఇతర అధికారుల నియామకం కోసం ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పన అధికారుల పేర్లతో అవసరమైన జాబితాను గురువారం సాయంత్రంలోగా అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో బదిలీ అయినవారి స్థానంలో ఇన్చార్జిలను నియమిస్తూ డీజీపీ అంజనీ కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. హైదరాబాద్ సీపీగా విక్రమ్సింగ్ మాన్, వరంగల్ సీపీగా డీ.మురళీధర్, నిజామాబాద్ సీపీగా ఎస్.జయరాంను నియమించారు. సూర్యాపేట ఎస్పీగా ఎం.నాగేశ్వర్రావు, సంగారెడ్డి ఎస్పీగా పీ.అశోక్, కామారెడ్డి ఎస్పీగా కే.నరసింహారెడ్డి, జగిత్యాల ఎస్పీగా ఆర్.ప్రభాకర్రావు, మహబూబ్నగర్ ఎస్పీగా అందెరాములు, నాగర్కర్నూల్ ఎస్పీగా సీహెచ్.రామేశ్వర్, గద్వాల ఎస్పీగా ఎన్ వి, మహబూబాబాద్ ఎస్పీగా జే.చెన్నయ్య, నారాయణ్పేట ఎస్పీగా కే.సత్యనారాయణ, భూపాలపల్లి ఎస్పీగా ఏ.రాములును నియమించారు. తెలంగాణలో 20 మంది అధికారుల బదిలీ తెలంగాణలో మొత్తం 20 మంది అధికారులను ట్రాన్స్ఫర్ చేస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీచేసింది. బదిలీ అయిన వారిలో 13 మంది పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, నలుగురు కలెక్టర్లు, ముగ్గురు ఇతర శాఖల ఉన్నతాధికారులు ఉన్నారు. వీరిలో రవాణాశాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, ఎక్సైజ్ డైరెక్టర్ ముషారఫ్ అలీ, వాణిజ్య పన్నులశాఖ కమిషనర్ శ్రీదేవి ఉన్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీశ్, మేడ్చల్ కలెక్టర్ అమోయ్కుమార్, యాదాద్రి కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి, నిర్మల్ కలెక్టర్ వరుణ్రెడ్డితోపాటు హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్ పోలీస్ కమిషనర్లు సీవీ ఆనంద్, రంగనాథ సత్యనారాయణ.. సంగారెడ్డి, కామారెడ్డి, జగిత్యాల, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, గద్వాల్, మహబూబాబాద్, భూపాలపల్లి, నారాయణపేట, సూర్యాపేట ఎస్పీలు రమణకుమార్, శ్రీనివాస్రెడ్డి, భాస్కర్, కే నర్సింహ, మనోహర్, సృజన, చంద్రమోహన్, కరుణాకర్, వెంకటేశ్వర్లు, రాజేంద్రప్రసాద్ను బదిలీ చేసింది.