- బండ్లగూడ జాగీర్ మున్సిపాల కార్పొరేషన్ లో వండర్..
- ఒక్క కోటి 25 లక్షలు పలికిన గణేష్ లడ్డు..
హైదరాబాద్ : గణేష్ నవరాత్రుల అనంతరం, నిమజ్జనం జరిపే రోజు గణేష్ మండపాల వద్ద స్వామివారి ప్రసాదమైన లడ్డూను వేలం వేయడం పరిపాటి.. కానీ ఈసారి లడ్డూ వేలం పాటలో వండర్ జరిగింది.. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గణేష్ లడ్డు రికార్డు ధర పలికింది.. కీర్తి రిచ్ మండ్ విల్లాలో ఏర్పాటు చేసిన గణపతి స్వామి వారి చేతిలోని లడ్డు ప్రసాదం వేలంపాటలో రూ. 1.25 కోట్లకు పలికింది. గణేష్ లడ్డు వేలంలో ఇదే అల్ టైమ్ రికార్డు ధర..