- నిమజ్జనానికి బయలుదేరిన విజయపురి కాలనీ విజయ గణపతి..
- గణపతి లడ్డూను వేలంలో దక్కించుకున్న భక్తుడు చిట్టెంశెట్టి నరేష్..
- స్వామివారి విగ్రహ దాత కూడా ఆయనే కావడం విశేషం..
- వారం పైగా కాలనీ వాసుల విశేష పూజలందుకున్న గణపయ్య..
హైదరాబాద్: ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య అంటూ భక్తి శ్రద్దలతో పూజలు చేసిన భక్తాదులు తాము పూజించిన గణపయ్యలను నిమజ్జనానికి ఒక్కొక్కరుగా వేడుకతో తీసుకుని వెళ్ళుతున్నారు.. ఇదే క్రమంలో కొత్తపేట, విజయపురి కాలనీ, స్ట్రీట్ నెంబర్ 5 లోని ప్రతిష్టించిన గణపతిని ఆదివారం రోజు నిమజ్జనానికి తీసుకు వెళ్లారు.. ఈ వారం రోజుల పాటు కాలనీ వాసుల విశేష పూజలందుకున్న గణపతి కాలనీ భక్తాదులను ఆశీర్వదిస్తూ నిమజ్జనానికి తరలి వెళ్లారు.. కాగా కాలనీలో చిట్టెం శెట్టి నరేష్ అనే భక్తాగ్రేసరుడు ఈ గణనాధుని ప్రతిష్టకు విగ్రహాదాతగా ఉన్నారు.. కాగా నిమజ్జనం రోజున గణనాథునికి సమర్పించిన లడ్డూ ప్రసాదాన్ని ఆయనే రూ. 10 800 లకు సొంతం చేసుకోవడం విశేషం.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేవదేవుని ప్రసాదాన్ని దక్కించుకోవడం తన పూర్వజన్మ శుకృతంగా భావిస్తున్నానని.. అదేవిధంగా ఈ వారం రోజుల నుంచి.. గణపయ్య మండపం వద్ద పూజల్లో పాల్గొని తమ భక్తి భావాన్ని ప్రదర్శించి సహకరించిన కాలనీ వాసులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.. కాగా ఆదివారం రోజు జరిగిన కార్యక్రమానికి పెద్ద ఎత్తున కాలనీ వాసులు, భక్తులు, మహిళలు మరీ ముఖ్యంగా సీనియర్ సిటీజన్స్ పాల్గొనడం విశేషంగా చెప్పవచ్చు..