- షాబాద్ జడ్పీటీసీ పట్నం అవినాష్రెడ్డి
షాబాద్ : షాబాద్ గ్రామాల అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని షాబాద్ జడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం షాబాద్ మండల పరిధిలోని సర్దార్ నగర్ గ్రామంలో శివాలయం,ముద్దంగూడ గ్రామాలలో సీసీ రోడ్ పనులకు సర్పంచులు మునగపతి స్వరూప ,కుర్వ జయమ్మతో కలిసి పనులు ప్రారంభించారు .ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ …మారుమూల గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక చర్య తీసుకుంటున్నట్లు తెలిపారు .ప్రజలకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించి ,అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తామన్నారు .ప్రజలకు ఎన్నకల్లో ఇచ్చిన వాక్దానాలను డాశలవారీగా నెరవేస్తామన్నారు . ప్రజలకోసం గ్రామాల అభివృద్ధి కోసం నిర్తన్తరం కృషిచేస్తామన్నారు . గ్రామాల్లో సీసీ రోడ్లు అండర్ డ్రైనేజీలు వీడి దీపాలు ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు.ఈ కార్యక్రమంలోమార్కెట్ కమిటీ మాజీ చైర్మ్రన్ నక్క శ్రీనివాస్ గౌడ్, మండల రైతు సమానవీయ సమితి కన్వీనర్ మధుసూదన్ రెడ్డి , సర్దార్నగర్ మాజీ సర్పంచ్ నర్సింలు ,ముద్దెముగూడ ఉపసర్పంచ్ సోమా ప్రతాప్ రెడ్డి ,సహకార సంగం డైరెక్టర్ నర్సింలు ,గ్రామస్తులు సుదర్శన్ ,పాపిరెడ్డి ,సత్యనారాయణ ,వార్డు సభ్యులు తదితరులు పాల్గోన్నారు..