- విజయదశమి నుంచి ప్రారంభం..
- కేబినేట్ భేటీలో మంత్రులకు ఏపీ సిఎం జగన్ సూచన..
- నేడు ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల వ్యూహంపై కూడా సాగిన చర్చ..
- న్యాయస్థానాలు కాదన్నా ముందుకెళ్తున్న జగన్ వ్యూహం ఏమిటి..?
అమరావతి: విజయదశమి నుంచి విశాఖ కేంద్రంగా పరిపాలన చేసేందుకు సీఎం జగన్ మోహన్ రెడ్డి సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని కేబినెట్ భేటీటో మంత్రులకు వివరించారు. దసరా నుంచి విశాఖ నుంచి పాలనకు అందరూ సిద్ధమవ్వాలన్నారు. విశాఖలో రుషికొండ విూద ఇప్పటికే సీఎం క్యాంప్ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఇది సీఎం జగన్ కోసం అని ఇప్పటి వరకూ ప్రకటించలేదు. ఆ క్యాంప్ ఆఫీస్ నిర్మాణంపై కోర్టులో కేసులు ఉన్నాయి. అవి టూరిజం భవనాల నిర్మాణమని అధికారులు చెబుతున్నారు. గతంలో కూడా.. సీఎం జగన్ తాను అక్టోబర్ నుంచే విశాఖ నుంచి పరిపాలన చేస్తామని ప్రకటించారు. ఆ మేరుక తాజాగా కేబినెట్ భేటీ అనంతరం మంత్రులకు స్పష్టత ఇచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన తాడేపల్లిలో జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను ఆమోదించింది కేబినెట్. ఈ సందర్బంగా సీఎం జగన్ వచ్చే విజయదశమి నుంచి విశాఖ నుంచే పరిపాలన ప్రారంభిస్తామని తెలిపారు. నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశమైంది. ఈ సందర్బంగా పరిపాలనా రాజధాని విశాఖ గురించి ప్రస్తావిస్తూ సమావేశంలో సీఎం కీలక ప్రకటన చేశారు. విజయదశమి నుంచే విశాఖ నుంచి పరిపాలన కొనసాగుతుందని అన్నారు. అప్పటి వరకు కార్యాలయాలను తరలించాలని నిర్ణయించారు. విశాఖలో కార్యాలయాల ఎంపికపై కమిటీని నియమించాలని ఆదేశించారు. కమిటీ సూచనల మేరకు కార్యాలయాల ఏర్పాటు ఉంటుందన్నారు సీఎం జగన్. అలాగే ముందస్తు ఎన్నికలు, జమిలి ఎన్నికలపై కేంద్ర నిర్ణయం ప్రకారం ముందుకు సాగుతామన్నారు. కొన్ని కార్యాలయాలను కూడా తలించాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఇందు కోసం ఓ కమిటీ ఏర్పాటు చేస్తున్నామని ఆ కమిటీ సూచనల మేరకు కార్యాలయాలను తరలిస్తామని మంత్రులకు చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే కార్యాలయాల తరలింపుపై ఇప్పటికే న్యాయస్థానాలు స్టే ఇచ్చాయి. అయితే కార్యాలయాలను కూడా తరలిస్తామని సీఎం జగన్ మంత్రులకు చెప్పడం ఆసక్తికరంగా మారింది. డిసెంబర్ లో అమరావతి కేసుల విచారణ సుప్రీంకోర్టులో జరగాల్సి ఉంది. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని కాకుండా… సీఎం జగన్ క్యాంప్ ఆఫీస్ ను విశాఖలో పెట్టుకునే అవకాశం ఉంది. కానీ ఆఫీసుల్ని మాత్రం విశాఖకు తరలించే అవకాశం లేదని అంచనా వేస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్దంగా ఉండాలని మంత్రులకు సీఎం జగన్ సూచించారు. జమిలీ ఎన్నికల విషయంలో కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూద్దామని సహచరులకు సూచించారు. అయితే ఎన్నికలకు సంబధించి ఎప్పుడైనా సిద్ధం గా ఉండాలని సూచించారు. అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు స్కాములపైనే ప్రధానంగా చర్చిద్దామని మంత్రివర్గ సహచరులకు చెప్పినట్లుగా తెలుస్తోంది. అసెంబ్లీ సమవేశాలను అందరూ సీరియస్ గా తీసుకోవాలని.. ప్రతి ఒక్కరూ హాజరు కావాలని ఆదేశించినట్లుగా తెలుస్తోంది.చంద్రబాబు అరెస్ట్ అంశం, రాజకీయ పరిస్థితుల పైనా చర్చలు జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే సీఎం జగన్ స్పందన ఏమిటో తెలియలేదు. కానీ అసెంబ్లీలో చంద్రబాబు ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు ప్రమేయం ఉన్న స్కాములపై విస్తృతంగా చర్చిద్దామని మంత్రులకు చెప్పడంతో.. ఇరవై ఒకటో తేదీ నుంచి ప్రారంభమయ్యే సమావేశాల్లో కేసుల అంశమే హాట్ టాపిక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి..