Friday, September 20, 2024
spot_img

బీఆర్‌ఎస్‌లో ఎమ్మెల్యే జోగు రామన్నఆధ్వర్యంలో నాయకులు..

తప్పక చదవండి

ఆదిలాబాద్ : కాంగ్రెస్‌లో సీఎం అభ్యర్థి ఎవరనేది క్లారిటీ లేని నాయకులు ప్రజా సంక్షేమం ఎలా చేస్తారని ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న ప్రశ్నించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మంచి పేరు తెచ్చి పెడుతున్నాయని..అదే ఉత్సాహంతో ప్రజలకు మరింత సేవలు అందించే దిశగా కార్యకర్తలు ముందుకు నడవాలని ఎమ్మెల్యే అన్నారు. జైనథ్ మండలంలో ఏర్పాటుచేసిన బీఆర్ఎస్ పార్టీ చేరికల కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే రామన్న పాల్గొన్నారు.
ఎమ్మెల్యే రామన్న సమక్షంలో పార్టీలో చేరిన కాంగ్రెస్‌, నాయకులు, కార్యకర్తలు
మొదట జైనథ్ బస్టాండు నుంచి చేరికల కార్యక్రమం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ నాయకులు మాజీ మార్కెట్ చైర్మన్ యాసం నర్సింగ్ రావు, మాజీ మండల ఉపాధ్యక్షుడు అల్లూరి కల్చప్ రెడ్డి, పిఎసిఎస్ మాజీ చైర్మన్ నాగన్న విఠల్‌తో పాటు మాజీ సర్పంచులు నరేందర్ రెడ్డి, మరో 500ల మంది కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారందరికీ బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే జోగు రామన్న గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు