Monday, October 28, 2024
spot_img

మద్యానికి బానిస అయ్యి మత్తులో కూతుళ్ళని హత్య చేసి తాను ఆత్మ హత్య చేసుకున్న తండ్రి …..

తప్పక చదవండి

కొట్టాయం: రోజూ మద్యం తాగివచ్చి అతడు పెట్టే టార్చర్‌ భరించలేక 16 ఏళ్లుగా కాపురం చేసిన అతని భార్య ఏడాది క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే, 15 ఏళ్ల లోపు వయసున్న ముగ్గురు బిడ్డలను ఆమె అతని దగ్గరే వదిలేసి వెళ్లింది. ఏడాదిగా బిడ్డలను పోషించిన అతను.. భార్య తిరిగి రాకపోవడంతో మరింత ఒత్తిడి లోనయ్యాడు. ఈ క్రమంలో గత రాత్రి పూటుగా మద్యం సేవించి వచ్చిన అతను ముగ్గురు కూతుళ్ల గొంతు కోశాడు. అనంతరం తనకు తాను ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేరళ రాష్ట్రంలోని కొట్టాయం జిల్లాలో ఈ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నిందితుడు మద్యానికి బానిసగా మారి రోజూ వేధిస్తుండటంతో భార్య గొడవపడి పుట్టింటికి వెళ్లిపోయిందని, ఆమె తన ముగ్గురు కుమార్తెలను కూడా భర్త దగ్గరే వదిలేసి వెళ్లిందని పోలీసులు తెలిపారు. భార్య దూరమవడంతో మానసిక ఒత్తిడికి లోనైన నిందితుడు చీటికిమాటికి ఆగ్రహంతో ఊగిపోయేవాడని, ఈ క్రమంలోనే గత రాత్రి కూడా మద్యం మత్తులో ఇంటికి వచ్చిన అతను కూతుళ్లు గొంతులు కోశాడని తెలిపారు. ముందుగా చిన్న కూతురు గొంతు కోశాడని, అది చూసి పారిపోయేందుకు ప్రయత్నించిన ఇద్దరు కూతుళ్లను వెంబడించి పట్టుకని గొంతులు కోశాడని చెప్పారు. అనంతరం అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు. అయితే, ఈ ఘటనలో బాధితులు ప్రాణాలు కోల్పేదని, తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. వారి చిన్న కూతురు పరిస్థితి విషమంగా ఉన్నదని, మిగతా ఇద్దరు కూతుళ్లకు ప్రాణాపాయం లేదని చెప్పారు. కాగా, ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు