Thursday, September 19, 2024
spot_img

శ్రావణమాసం సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల వర్షం…

తప్పక చదవండి

రాజన్న సిరిసిల్ల : వేములవాడ రాజన్న ఆలయాలనికి భక్తులు పోటెత్తారు. శ్రావణమాసం సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు తమ ఇష్ట దైవమైన రాజరాజేశ్వరస్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకొన్నారు. ఈ సందర్భంగా వారు తొలుత ఆలయ కల్యాణ కట్టలో తలనీలాలు సమర్పించి, ధర్మగుండంలో పవిత్ర స్నానాలు ఆచరించారు.
అనంతరం సర్వదర్శనం, ప్రత్యేక దర్శనం క్యూలైన్ల మీదుగా ఆలయంలోకి ప్రవేశించి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కును పెద్ద సంఖ్యలో భక్తులు చెల్లించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు