Friday, September 20, 2024
spot_img

తీరని విషాదం మిగిల్చిన రక్షాబంధన్‌..

తప్పక చదవండి
  • గుండెపోటుతో అన్న హఠాన్మరణం..
  • అన్న భౌతిక కాయానికి రాఖీ కట్టి విలపించిన చెల్లి..
  • పెద్దపల్లి జిల్లాలో హృదయవిదారక ఘటన..

పెద్దపల్లి : అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్‌ ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్నినింపింది. రాఖీ పండుగ వచ్చిందంటే చాలు సోదరీమణులు తమ సోదరులకు రాఖీ కట్టాలని ఎంతగానో ఆరాటపడుతుంటారు. అందరిలానే ఓ చెల్లి కూడా తన అన్నకు రాఖీ కట్టేందుకు ఆనందంగా తన పుట్టింటికి వెళ్లింది. అయితే అత్యంత విషాదకర రీతిలో మృతదేహానికి రాఖీ కట్టాల్సి వచ్చింది. చూసినవారందరినీ దు:ఖానికి గురిచేసున్న ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో జరిగింది. రాఖీ పండుగ ముందు విషాదం చోటు చేసుకుంది. ఎలిగేడు మండలం ధూళికట్టకి చెందిన చౌదరి కనకయ్యకు రాఖీ కట్టేందుకు చెల్లెలు గౌరమ్మ ఇంటికి వచ్చింది. అప్పటిదాకా చెల్లెతో సంతోషంగా గడిపిన కనకయ్య ఒక్కసారిగా గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఆపై క్షణాల వ్యవధిలో కన్నకయ్య ప్రాణాలు కోల్పోయాడు. ఎంతో సంతోషంగా తన అన్నయ్యకు రాఖీ కట్టేందుకు వచ్చిన చెల్లికి అంతులేని విషాదం మిగిలింది. చివరకు అన్నయ్య మృతదేహానికే సోదరి రాఖీ కట్టి తన ప్రేమను చాటుకుంది. ఇద్దరి మధ్య ఉన్న అనురాగాన్ని చూసినవారంతా కన్నీటి పర్యంతమయ్యారు. కన్నీటితో తన అన్నకు తుది వీడ్కోలు పలకాల్సి వచ్చింది. దీంతో రక్షాబంధన్‌ నాడే ఇంతటి బాధను అనుభవించాల్సి వస్తుందని ఊహించలేదంటూ ఆ చెల్లెలు కన్నీరు మున్నీరుగా విలపించింది. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన అన్నకు.. చివరిసారిగా రాఖీ కట్టి గుండెలవిసేలా రోదించింది. సోదరుడి మృతదేహానికి చివరిసారిగా రాఖీ కట్టి తన పేగుబంధాన్ని చాటుకుంది. ఇదే నా అన్నకు నేను కట్టే చివరి రాఖీ.. వచ్చే ఏడాది నుంచి రాఖీ కట్టేందుకు నా అన్న ఉండడు అంటూ గుండెలవిసేలా విలపించింది. చెల్లెలు గౌరమ్మ రోదన చూసిన వాళ్లందరినీ దుఃఖ సాగరంలో ముంచేసింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు