Friday, April 19, 2024

కాశ్మీర్‌లో పెట్రేగిన ఉగ్రవాదులు

తప్పక చదవండి
  • జవాన్ల ట్రక్కులు లక్ష్యంగా కాల్పులు
  • కాల్పుల్లో ముగ్గురు జవాన్ల మృతి

న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్‌లో జవాన్లు వెళ్తున్న ఆర్మీ ట్రక్కులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు జవాన్లు మృతి చెందగా, మరో ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఫూంచ్‌ జిల్లాలోని బూప్లియాజ్‌ ఏరియాలో ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న పక్కా సమాచారంతో నిన్న రాత్రి నుంచి బలగాలు ఆపరేషన్‌ కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో సావ్నీ ఏరియాలోని రాజౌరీ థనమండి సూరన్‌కోటే రహదారిపై గురువారం మధ్యాహ్నం 3:45 గంటలకు ఆర్మీ ట్రక్కులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. గతరాత్రి నుంచి బూప్లియాజ్‌ ఏరియాలో ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. ఈ క్రమంలోనే అక్కడికి రెండు ఆర్మీ ట్రక్కుల్లో బలగాలను తీసుకెళ్తున్నారు. దీంతో ఆర్మీ ట్రక్కులను గమనించిన ఉగ్రవాదులు మెరుపుదాడి చేశారు. ఇక ఇరు వర్గాల మధ్య భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పులతో అదనపు బలగాలను ఆ ప్రాంతానికి పోలీసులు చేర్చారు. ఫూంచ్‌ జిల్లాలోని ఆర్మ్‌డ్‌ పోలీసు యూనిట్‌లోని కంపౌండ్‌లో నిన్న రాత్రి పేలుళ్లు సంభవించాయి. వాహనాల అద్దాలు ధ్వంసం అయ్యాయి. దీంతో అక్కడ ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం మేరకు ఆపరేషన్‌ కొనసాగుతోంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు