ఆంధ్రప్రదేశ్లోని కుప్పం ద్రవిడ విశ్వవిద్యాలయంలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ తీర్మానానికి వ్యతిరేకంగా 356 పీహెచ్డీ డిగ్రీలను ఇచ్చారన్న ఆరోపణలపై విచారణ జరిపేందుకు ఆ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ విచారణ కమిటీని నియమించారు.. హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ బీ శేషశయనారెడ్డి నేతృత్వంలో విచారణ అథారిటీని నియమించారు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ తీర్మానానికి వ్యతిరేకంగా 356 పీహెచ్డీ డిగ్రీలను ఇచ్చేశారని ఆ యూనివర్సిటీ వీసీ తుమ్మల రామకృష్ణపై ఆరోపణలు వచ్చాయి. దీంతో నిజాలను నిగ్గు తేల్చేందుకు గవర్నర్ ఈ చర్య తీసుకున్నారు.